Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : అటవీ భూముల రక్షణలో భాగంగా నిర్వరిస్తున్న విధులకు భంగం కలిగిస్తూ, తమ పై దాడులకు దిగుతున్న వారి పై లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు చేపట్టి, తమకు భరోసా కలిగించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం అటవీశాఖ మంత్రి సురేఖ ని సచివాలయంలోని తన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించి, తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు మంత్రి సురేఖన కోరారు. ఈ దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపడాతమని, అటవీ అధికారులు, సిబ్బందికి ఏ సాయం కావాలన్నా సిద్ధంగా ఉంటామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. మంత్రి గారిని కలిసిన వారిలో తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నాగేందర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బి. సాంబు, సెక్రటరీ ప్రశాంత్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. శ్రీనివాస్ రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ పి.సుకన్య, కోశాధికారి బి. కోటేశ్వర్ రావు తదితరులున్నారు.
Reporter
Telugu Rekha Media