Sunday, 13 September 2026 03:58:29 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రజావాణి దరఖాస్తులను నిబద్ధతతో పరిష్కరించాలి...

Date : 24 June 2024 08:21 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ భవనం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణితో కలిసి, కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను మానవతా దృక్పథంతో సకాలంలో పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం (124) దరఖాస్తులు రాగా అందులో అత్యధికంగా జిల్లా రెవెన్యూ శాఖకు సంబంధించి 84, ఉపాధి శాఖ 10, మహానగర పాలక సంస్థ 04, షెడ్యూల్డు కులాల శాఖ 03, DBCDO (MJBC) 03, నీటి పారుదల శాఖ 02, జిల్లా పంచాయతీ శాఖ 02, వైద్య ఆరోగ్య శాఖ 02, జిల్లా వ్యవసాయ శాఖ 02, పోలీస్ శాఖ 03, మరియు ప్రాంతీయ సహకార సంస్థ, లీడ్ బ్యాంక్, పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, నర్సంపేట మునిసిపాలిటీ, గిరిజన అభివృద్ధి, రోడ్లు మరియు భవనాల శాఖ, ఎం జి ఎం, జిల్లా విద్యా శాఖ, మరియు జిల్లా గ్రామీణ అభవృద్ధి శాఖలకు చెందినవి ఉన్నాయని. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు పరిష్కరణ నిమిత్తం సిఫారసు చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు చేరేవిధంగా జిల్లా అధికారులు చొరవ చూపాలని, ప్రజలనుండి వారం వారం స్వీకరించిన ధరకాస్తులలో పరిష్కరించేందుకు వీలుకానీ పక్షంలో దరఖాస్తుదారునికి అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రజావాణి పోర్టల్ లో పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సంబందిత శాఖల జిల్లా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో కృష్ణ వేణి, జిల్లా పరిషత్ సిఇవో రాం రెడ్డి , డిఆర్డీఓ కౌసల్యాదేవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :