Telugu Rekha Media - తెలంగాణ / వరంగల్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల గిర్మాజిపేట కొత్తవాడ ఆటోనగర్ నందు శ్రీమతి నాగమణి హెచ్ఎం అధ్యక్షతన స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టేవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి విచ్చేసి, పాఠశాలలోని 8 మరియు 9వ తరగతి చదువుతున్న 115 మంది విద్యార్థిని విద్యార్థులకు తన చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్స్ మరియు పదవ తరగతి చదువుతున్న 43 మంది విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కొరకు 4 వేల రూపాయలు నగదును అందజేశారు. ఈ సంధర్బంగా విద్యార్థులను ఉద్దేశించి సిఐ గోపి మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులుగా వెలుగొందాలంటే విద్య ఒక సాధన దాని కొరకు విద్యార్థులందరూ ఇష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరాల దృష్ట్యా నా శక్తి మేరకు సహాయ సహకారాలను అందించగలనని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ భూపాల్ బుచ్చి రెడ్డి, దుర్గం రవి, అప్సర్, సరోజినీ దేవి, శకుంతల దేవి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Reporter
Telugu Rekha Media