Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సిద్దిపేటలో జిల్లాలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎవరు కూడా బలవంతంగా స్కూల్స్ బంద్ చేయించడం , స్కూల్ల వద్దకు వెళ్లి పిల్లలకు ఇబ్బంది కలిగించడం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. స్కూల్ పిల్లల తరఫున ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థి సంఘాల నాయకులు, డిఇఓ లేదా, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకు, లేదా కలెక్టర్ గారిని కలసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వారు ఆ సమస్యలపై స్కూల్లో యాజమాన్యాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని స్కూల్ల ముందు ధర్నాలు రాస్తారోకోలు చేసి స్కూల్ పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు.
Reporter
Telugu Rekha Media