Telugu Rekha Media - తెలంగాణ / : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మహిళా నర్సింగ్, సుమన్ హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆదివారం హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 50 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలు అయ్యాయి. 50 మందిని స్థానిక హాస్పిటల్ కు హాస్టల్ యజమాన్యం తరలించింది. అందులో ఆరుగురి పరిస్థితి సీరియస్ గా వున్నట్లు సమాచారం. కాలేజీ లో వివరణ కోరగా మా దగ్గర ఎవరికీ ఫుడ్ పాయిజన్ కాలేదని యజమాన్యం చెబుతోంది. వాటర్ లో కల్తీ జరగడం వలన ఇలా జరిగిందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.
Admin
Telugu Rekha Media