Telugu Rekha Media - తెలంగాణ / వరంగల్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ నేషనల్ గ్రీన్ కాప్స్ (ఎన్జీసి) మరియు వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు వరంగల్ శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోస్టర్ తయారీ పోటీలో చెన్నారావుపేట మండలంలోని సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థిని ముదురుకోల శ్రీనిధి ప్రధమ స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా విద్యార్థి శ్రీనిధి మరియు గైడ్ టీచర్ గణేష్ గారిని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి వాసంతి గారు, జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ గారు ప్రశంసా పత్రం మరియు మెమెంటో తో సత్కరించి అభినందించారని హెచ్ఎం కరుణాకర్ రెడ్డి గారు తెలిపారు. భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకోగలగడం అనే అంశంపై వరంగల్ జిల్లాలోని అన్ని ఉన్నత జిల్లాస్థాయి కవితలు మరియు పోస్టర్ తయారీ పోటీలలో పాల్గొన్న శ్రీనిధితో పాటు పాల్గొన్న విద్యార్థులు సహస్ర,మానస, అక్షయ,లహరి,ధరణి,బి.సహస్ర లను పాఠశాల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి గారు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు కళా, సృజనాత్మక రంగాలలో కూడా తమ పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
Reporter
Telugu Rekha Media