Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్యామిలీ ఫోటోలు పిల్లల ఫోటోలు సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి రకరకాలుగా వాడుకుంటున్నారు. తల్లి కూతుళ్ళ అనుబంధం పై కొందరు యూట్యూబర్లు చేసిన అసభ్య కామెంట్స్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే, మీ పిల్లల కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది. ఫోటోలకు ప్రైవసీ ఏర్పాటు చేసుకోవాలి, కొన్ని కొన్ని సందర్భాలలో మీ స్నేహితులు మరియు సన్నిహితులు మనకు పడనివారు, వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా బాధ్యతగా ఉండాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు.
Admin
Telugu Rekha Media