Telugu Rekha Media - తెలంగాణ / ఆదిలాబాద్ : నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువకి తాగునీటి అవసరాల కోసం, ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. రోజుకి 3 వేల క్యూసెక్కుల చొప్పున.. మూడు రోజుల పాటు.. ఒక టీఎంసీ నీటి విడుదల చేయనున్నారు. ఇక.. నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ.. 505 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 TMC లకు గాను.. ప్రజెంట్ 123 TMC లుగా ఉంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 15 వేల క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది..
Reporter
Telugu Rekha Media