Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మరియు ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా ప్రభుత్వం క్రీడలు, కళా సంస్కృతులకు మొత్తంగా రూ. 325.05. కోట్ల బడ్జెట్ పై ఏపీ జితేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగం ఎంతో నష్టపోయిందని.. రైతు సాధికారత దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేవలం వ్యవసాయానికి 72 వేల కోట్ల రూపాయలు కేటాయించడం ప్రభుత్వ దూరదృష్టిని తెలియజేస్తుందని జితేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని. చేతల ప్రభుత్వమని తక్కువ కాలంలోనే నిరూపించామని తెలిపారు. వివిధ రంగాలకు కేటాయింపులను ఆయన సభలో వివరించారు. మొత్తంగా తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు..
Reporter
Telugu Rekha Media