Tuesday, 28 July 2026 09:02:23 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నాలాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయలి...

-- హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.

Date : 12 July 2024 10:02 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : వర్షాకాలం దృష్ట్యా నాలాల విస్తరణ పనులను త్వరతగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నాలాల విస్తరణ పనులు, నయీమ్ నగర్ వంతెన నిర్మాణ పనుల పురోగతి, చెరువు శిఖముల ఆక్రమణలు, తదితర అంశాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో పాటు రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సాగునీటి పారుదల, కుడా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నాలాల విస్తరణ పనుల విషయంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నాలాల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తయ్యేవిధంగా అధికారులు కృషి చేయాలన్నారు. నయీమ్ నగర్ వంతెన నిర్మాణ పనుల పురోగతి పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా నాలాల విస్తరణ, నయీమ్ నగర్, ఇతర అభివృద్ధి పనులపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశంలో హన్మకొండ ఆర్డీవో వెంకటేష్, జీడబ్ల్యూఎంసీ అధికారులు రాజయ్య, ప్రవీణ్ చంద్ర, శంకర్ లింగం, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, సీఎంహెచ్వో డాక్టర్ రాజేష్,టౌన్ ప్లానింగ్ సీపీవో వెంకన్న, సాగునీటిపారుదల శాఖ అధికారులు వెంకటేశ్వర్లు, సీతారాం, హర్షవర్ధన్, డీఐవో రాంమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: