Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : నర్సంపేట జూలై 17 ఏకశిలా న్యూస్: బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రెడ్ క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తండ్రి నిమ్మగడ్డ సుబ్బారావు అనారోగ్యంతో మరణించగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం సుబ్బారావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు ఉన్నారు.
Reporter
Telugu Rekha Media