Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : బీజేపీ లో, బిఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారని ఆయన గుర్తు చేశారు. దీంతో బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అయ్యాక కవితకు బెయిల్ వస్తుందన్నారు. ఆ తర్వాత కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి, హరీశ్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవులు లభిస్తాయని జోస్యం చెప్పారు.
Admin
Telugu Rekha Media