Sunday, 01 March 2026 11:52:26 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో లెక్కలు చూడాల్సిందే...

--తాను రాష్ట్రానికి మంత్రిని అయినా.. అనంతపురం జిల్లాకు కూలీనే.. -- ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Date : 17 June 2024 06:32 PM

Telugu Rekha Media - రాజకీయం / అనంతపురం : అనంతపురం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. తాను రాష్ట్రానికి మంత్రిని అయినా.. అనంతపురం జిల్లాకు కూలీనేనని తెలిపారు. తాగు సాగునీటి కోసం జరిగిన పోరాటాల మధ్య తాను పెరిగానని చెప్పారు. జిల్లా ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని అన్నారు. జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాటిచ్చారు. జిల్లా ప్రజల నమ్మకానికి మించి పని చేస్తానని అన్నారు. ఆర్థిక మంత్రిగా అత్యంత బరువు బాధ్యతలు మోయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఇంతవరకు లెక్కలు చూడలేదని అన్నారు. లెక్కలు చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో లెక్కలు చూడాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలి.. అభివృద్ధిని పరుగులు పెట్టించాలని కోరారు. ఇదే ఆశయంతో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :