Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / బాపట్ల : దీపావళి సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మందుగుండు దుకాణాల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేసింది. దీపావళి మందుల దుకాణాల వద్ద ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు పర్వక్షణలో సిబ్బంది విధి నిర్వహణ లో పాల్గొన్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని వెంకటేశ్వరరావు తెలిపారు.
Admin
Telugu Rekha Media