Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : బీసీ గర్జన సభలో భాగంగా రెండవ రోజు సైకిల్ యాత్ర మొదలుపెట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం హనుమకొండ లోని టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి,కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ నివాసంలో సోమవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నను, ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫిబ్రవరి 2న జరిగే భారీ బహిరంగ సభ సమావేశంపై సుదీర్ఘ చర్చ జరిపారు. అదే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ. ఫిబ్రవరి 2న జరిగే భారీ బహిరంగ సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హనుమకొండ లో జరుగుతుందని వెల్లడించారు.ఇది ఆషామాసి సభ కాదు భారతదేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు నుంచి స్టాలిన్ బీహార్ నుంచి అఖిలేష్ యాదవ్ ఇలా చాలా పెద్ద ఎత్తున బీసీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హన్మకొండ సభకు రాబోతున్నారన్నారు.గాలిలో హెలిక్యాప్టర్లు చెక్కర్లు కొట్టబోతున్నాయన్నారు. ఈ చక్కర్లతో మిగతా రాజకీయ నాయకులకు చక్కరచ్చి పడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఆర్ట్స్ కాలేజ్ జరిగే బీసీల సభ విడాకుల సభ అని వ్యాఖ్యానించారు. కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఒక యాదవ బిడ్డ యాదవ బిడ్డ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉండడం ఇంతకుముందు మనకు గర్వ కారణం అనంతరం టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగం రెడ్డి సుందరరాజు యాదవ్ మాట్లాడుతూ.. గత 30 ఏళ్ల నుండి బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే 2028 ఎన్నికల్లో బీసీ రాజ్యం రాబోతుందని తెలిపారు. వరంగల్లో జరిగే బిసి గర్జనకు లక్షకు పైగా బీసీలు హాజరు కావాలన్నారు. బీసీల బాధల్ని తీర్చేందుకు కొమురవెల్లి మల్లన్న రూపంలో తీన్మార్ మల్లన్న వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టీం రాష్ట్ర అధ్యక్షులు మాదం రజని కుమార్ యాదవ్, షైన్ విద్యాసంస్థల చైర్మన్ కుమార్ యాదవ్, భాస్కర్ వరంగల్ బార్ అసోసియేషన్ సభ్యులు బీసీ ఇంటలెక్చవల్ ఫోరం నాయకులు బీసీ ఆజాది నాయకులు బీసీ జాక్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
Telugu Rekha Media