Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : జిల్లా కేంద్రంలో కార్పొరేట్ ప్రభుత్వ అనుమతులను తుంగలో తొక్కి, జీవో నెంబర్ 1,10,92,42 లను ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఫీజులు పెంచి , పెంచిన ఫీజులను నోటీసు బోర్డులో పెట్టకుండా , నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని .... ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో హనుమకొండ జాయింట్ కలెక్టర్ ఏ . వెంకటరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్, భాష బోయిన సంతోష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా ప్రభుత్వ జీవోలను ఉలంగించి విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుని ఈ విద్యా సంవత్సరం పది నుంచి 20% ఫీజులు పెంచి పెంచిన ఫీజులను నోటీస్ బోర్డ్ లో పెట్టకుండా, విశాలమైన తరగతి గదులు లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్య సంస్థను చెప్పుకుంటూ కనీస మౌలిక సదుపాయాలు లేకుండా జీవో నెంబర్ 1,10,92,42... ఉల్లంఘించి యదేచ్చగా విద్యా వ్యాపారాన్ని జిల్లా కేంద్రంలో కొనసాగిస్తున్నారు దాంతోపాటు పాఠశాలలో షూ ,టై ,బెల్టు, పాఠ్యపుస్తకాలు నోటుబుక్స్, యూనిఫార్మ్స్ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కావున ఈ అంశాలపై తగిన న్యాయ వీచారణ చేసి కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థలు తక్షణ మూసివేయాలని డిమాండ్ చేయడం జరిగింది . లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుక్కల కుమార్, జక్కుల భాను ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి బొజ్జు జ్యోతి, కసరబోయిన రవితేజ లు పాల్గొన్నారు.
Admin
Telugu Rekha Media