Telugu Rekha Media - రాష్ట్రీయం / అమరావతి : అమరావతిలో సీఐఐ ఏర్పాటు చేయనున్న జీఎల్సీలో భాగస్వామిగా టాటా అంగీకరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ. సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ ఆన్ కాంపిటీటివ్నెస్లో టాటా భాగస్వామి. విశాఖలో టీసీఎస్ డెవలప్ సెంటర్ ఏర్పాటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తాం అని అన్నారు.
Admin
Telugu Rekha Media