Telugu Rekha Media - రాష్ట్రీయం / గుంటూరు : గుంటూరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు ఇచ్చిన 'నైతిక విలువలసలహాదారు' పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు మంచి మాటలును చెప్పేందుకే ఒప్పుకున్నానని, పదవుల కోసం కాదని ఆయన చెప్పారు. నేటి యువత సన్మార్గంలో నడిస్తేనే దేశానికి మంచిపేరు వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం చాగంటికి క్యాబినెట్ ర్యాంకుతో ఈపదవి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు రెండుసార్లు ఇటువంటి పదవులును సున్నితంగా చాగంటి తిరస్కరించారు.
Admin
Telugu Rekha Media