Telugu Rekha Media - రాష్ట్రీయం / హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి తో అన్ని యూనివర్సిటీ ల నూతన వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్ణా రెడ్డి.సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి శనివారం బేటీ అయ్యారు. అయన వైస్ ఛాన్సలర్లకి దిశానిర్దేశం చేసారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ లపైన నమ్మకం కల్గించేలా పని చేయాలి. కొంత కాలం గా యూనివర్సిటీ పైన నమ్మకం తగ్గుతోంది. యూనివర్సిటీ ల గౌరవాన్ని పెంచాలి. యూనివర్సిటీ ల్లో వ్యవస్థ లు దెబ్బతిన్నాయి. వ్యవస్థ ల పునరుద్ధరణ కు ఏం చేయాలో అధ్యయనం చేయాలి. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని అన్నారు. అవసరమైతే కన్సల్టెన్సీ లను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలి. వైస్ ఛాన్సలర్లకి ఎవరి ప్రభావితం తో పోస్ట్ లు ఇవ్వలేదు. మెరిట్,సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేశాం. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సో వస్తుంది. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్ల కి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ సహకారం ఉంటుంది. యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయాలి. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల ను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు..ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యూనివర్సిటీ ల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాల పైన ద్రుష్టి సారించాలి. విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు
Admin
Telugu Rekha Media