Saturday, 13 June 2026 12:30:35 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

Date : 30 October 2024 06:17 PM

Telugu Rekha Media - రాష్ట్రీయం / జగిత్యాల/కోరుట్ల : కోరుట్ల, జిల్లాలో నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులందరూ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.బుధవారం జిల్లాలోని మల్లాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పై అంగన్వాడీ, ఆశ వర్కర్, పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని ఇంట్లో వారి వివరాలు పక్కాగా నమోదు చేయాలని,గ్రామాల్లో అధికారులు ఇచ్చిన మ్యాప్ ఆధారితంగా నాలుగు జోన్లుగా విభజించి, అధికారులు సమన్వయంతో సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క ఆఫీసర్ 150 నుండి 200 వరకు ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ వివరాలను సేకరించాలని సర్వే అయిన ప్రతి ఇంటికి ఖచ్చితంగా స్టిక్కర్ అతికించాలని తెలిపారు. నవంబర్ 1 తేదీ ఉదయం నుండి ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్లో సర్వేని ప్రారంభించాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ దరఖాస్తు పత్రంలో 56 ప్రశ్నలతో కూడిన పత్రం ఉంటుందని, కావున దీనికి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇచ్చిన బుక్లెట్ ఆధారంగా కోడ్ పద్ధతిలో కుటుంబ నిర్ధారణ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. సీరియల్ నెంబర్ ఆధారితంగా గ్రామంలోని వార్డును, ఏరియాను ఎంపిక చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు ధరణి పాస్ పుస్తకాలు కుటుంబం దగ్గర ఉంచుకునేలా ప్రచారం చేయాలని అన్నారు. ఎన్యుమరేషన్ సమయంలో కుటుంబం యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని తెలియజేయాలని, నింపిన షెడ్యూల్ ఫారంలోని జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు. రోజువారి సర్వే నివేదికను జిల్లా వారీగా ఏరోజుకారోజు సాయంత్రం 6 గంటలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :