Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట : హుస్నాబాద్ లో ప్రజా పాలన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 కి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళయాత్ర వాహనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈరోజు నుండి డిసెంబర్ 7 వరకు గ్రామగ్రామాన గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో చేపట్టిన కార్యక్రమాల పై సాంస్కృతిక కళా బృందం అవగాహన కల్పించనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సవవత్సర కాలంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రచారం చేయడానికి సమాచార తెలంగాణ ప్రభుత్వం పక్షాన 33 జిల్లాలలో ఇలాంటి వాహనాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తుంది. ఈరోజు హుస్నాబాద్ లో ప్రారంభించుకోవడం జరిగింది.. హుస్నాబాద్ ప్రాంత కళాకారులు కూడా చారిత్రాత్మక చరిత్ర లో ఉన్నారు. ప్రజలందరికీ చైతన్యం కలిగేలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 110 కోట్ల మంది ప్రయాణం 3720 కోట్ల రూపాయలు విలువైన ఉచిత ప్రయాణం చేశారని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ ,ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నాం. పది సంవత్సరాల తరువాత 40 శాతం మెస్ చార్జీలు పెంచుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ,యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లను ప్రారంభిస్తుంది. ప్రజా పాలన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అవగాహన కల్పించాలి. అణిచివేత లేదు నియంతృత్వం లేదు.. స్వేచ్ఛా ఉంది.. ఎమ్మెల్యేలు మంత్రులను ఎవరినైనా కలవవచ్చు. మీ నిరసనలు తెలపవచ్చు.. ఎవరినైనా కలవవచ్చ్చు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం గ్రామాల్లో అందరికి విసృతంగా ఆవాహన కల్పించాలని అన్నారు.
Admin
Telugu Rekha Media