Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్-హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఒక యువతి రోడ్డు ప్రమాదానికి గురైయింది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ లారీ కింద ఇరుకుంది. ఆదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రమాదాన్ని చూసి తన వాహనాన్ని ఆపారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. స్థానికులు జుట్టు కత్తిరించి యువతి ప్రాణాలను కాపాడారు. గాయాలపాలైన యువతిని కరీంనగర్లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపి.. చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు బండి సంజయ్ చెప్పారు.
Admin
Telugu Rekha Media