Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపేల్లి గ్రామం సాయినగర్ కాలనీలోని శ్రీదత్తసాయి క్షేత్రంలో గురుపౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీసశ్ఛితనంద సమస్త సద్గురు సాయినాధ్ మహరాజ్ను దర్శించుకోవడానికి సుమారు రెండు వేల మంది భక్తులు తరలివచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా విశ్రాంత టీచర్లు కోడూరు సరోజన , వెంకటరెడ్డి మరియు పద్మకు దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానము చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పూర్వ ఆలయ వ్యవస్థాపకులు తారాభాయి, ఆలయ వ్యవస్థాపకులు పెద్థి సూర్యప్రకాశ్ మరియు విశ్రాంత D.S.P రాజిరెడ్డి పాల్గొనడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని విధాలుగా సేవ సహకారాలు అందించడం జరిగింది. దేవలయ అర్చకులు కొండ్ర కోటేశ్వర చార్యులు పాల్గొనడం జరిగింది.
Admin
Telugu Rekha Media