Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ : కరీంనగర్ ప్రజావాణిలో స్వీకరించే దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ రెవె న్యూ, తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. సీఎం ప్రజా దర్బార్ లాగిన్ లో ఉన్న అన్ని దరఖాస్తులను వచ్చేనెల ఒకటికల్లా పరిష్కరించాలని మండలాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి పవన్ కుమార్, ఏవో సుధాకర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
Telugu Rekha Media