Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / ములుగు : ములుగు జిల్లాలో మరో విషాద సంఘటన జరిగింది. వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్విస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్ లో ఘటన జరిగింది. కుటుంబ కలహాలు కారణమా..? వరుస ఘటనలతో మానసిక ఒత్తిడి తో ఆత్మహత్య..? అనే అనుమానాలు వున్నాయి. సోమవారం ఉదయం 6 గంటలకు తన డ్రైవర్ కి ఎస్సై హరీశ్ కాల్ చేసాడు. తనను హోటల్ నుండి పిక్ అప్ చేసుకొమ్మని చెప్పాడు. డ్రైవర్ వచ్చే వరకే తుపాకీతో కాల్చుకున్నాడు. అంతకుముందు హరిశ్, మరో అమ్మాయి గోడవపడ్డట్టు, తనను వదలిపెట్టాలంటూ హరీష్ బ్రతిమిలాడినట్లు ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
Admin
Telugu Rekha Media