Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : హైదరాబాద్ లోని గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కేవలం దీన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సమస్యలపై అవగాహన లేని అసమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుంది. గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించేందుకు సీఎం సమయం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఢిల్లీ చుట్టు షటిల్ సర్వీస్ లు చేయటానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇళ్ల చుట్టు తిరగటంలోనే బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వెంటనే గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే ప్రజలే ఆ ఫ్లై ఓవర్ ను ప్రారంభించే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు.
Reporter
Telugu Rekha Media