Saturday, 13 June 2026 12:47:37 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రైతు సంక్షేమమే ధ్యేయంగా రెండు లక్షల రైతు రుణమాఫీ...

Date : 18 July 2024 08:54 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతుల రుణమాఫీ సంబురాలు ధర్మసాగర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం ధర్మసాగర్ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం క్షీరాభిషేకం చేయటం జరిగింది. అనంతరం గుర్రపు ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణలో అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల పట్ల రైతు భరోసా రైతు రుణమాఫీ పై మంచి నిర్ణయం తీసుకున్నారని తెలుపుతూ, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల పైన మోయలేని భారాన్ని మోపి పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల వారికున్న మమకారం వారికి మేలు చేయాలని ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఆగష్టు 15 లోపు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నా విషయం అందరికీ తెలుసు, ఇప్పుడు లక్ష వరకు రుణమాఫీ ఆగస్టు 15లోపు 2 లక్షలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుందని ప్రసాద్ ప్రెస్ మీట్ లో తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, పిఎసిఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్, నరసింహారెడ్డి, రావుల వెంకటరెడ్డి ,బొడ్డు ప్రదీప్ కుమార్, చిర్ర కుమార్ ,అంకం రాజకుమారి, మాజీ ఎంపిటిసి రోo డి రాజు, మాజీ ఎంపిటిసి జాలిగాపు వనమాల, ఠాకూర్ అనురాధ, జాలిగాపు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :