Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతుల రుణమాఫీ సంబురాలు ధర్మసాగర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం ధర్మసాగర్ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం క్షీరాభిషేకం చేయటం జరిగింది. అనంతరం గుర్రపు ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణలో అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల పట్ల రైతు భరోసా రైతు రుణమాఫీ పై మంచి నిర్ణయం తీసుకున్నారని తెలుపుతూ, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల పైన మోయలేని భారాన్ని మోపి పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల వారికున్న మమకారం వారికి మేలు చేయాలని ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఆగష్టు 15 లోపు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నా విషయం అందరికీ తెలుసు, ఇప్పుడు లక్ష వరకు రుణమాఫీ ఆగస్టు 15లోపు 2 లక్షలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుందని ప్రసాద్ ప్రెస్ మీట్ లో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, పిఎసిఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్, నరసింహారెడ్డి, రావుల వెంకటరెడ్డి ,బొడ్డు ప్రదీప్ కుమార్, చిర్ర కుమార్ ,అంకం రాజకుమారి, మాజీ ఎంపిటిసి రోo డి రాజు, మాజీ ఎంపిటిసి జాలిగాపు వనమాల, ఠాకూర్ అనురాధ, జాలిగాపు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media