Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బుగ్గారం ఎంపిఓ అఫ్జల్ మియా ప్రజాలకు సూచించారు. బుగ్గారం మండల కేంద్రంలో మంగళవారం ఎంపీవో అఫ్జల్ మియా గ్రామ పంచాయతీ సెక్రెటరీ అక్బర్, గ్రామపంచాయతీ సిబ్బందితో వాడ వాడల తిరుగుతూ అపరిశుభ్రత ఉన్న దగ్గర బ్లీచింగ్ ,ఆంటీబయాటిక్ స్ప్రే చేయించారు.కలుపు మొక్కలు గడ్డి మొక్కలు పెరిగిన దగ్గర పెరగకుండా ఉండేందుకు ఆంటీ లార్వా స్ప్రే చేపించారు.ఈ సందర్భంగా ఆఫ్జల్ మియా మాట్లాడుతూ ప్రజలు వారి ఇంటి ఆవరణలో చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేసుకోవాలని వర్షాకాలంలో ఎక్కువ ఈగలు దోమల వల్ల రకరకాల జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందని కావున సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అక్బర్ ,పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media