Telugu Rekha Media - తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తాండూరు మండల ఎంపీపీగా పూసాల ప్రణయ్ కుమార్ తన పదవీ కాలాన్ని సంపూర్ణంగా పూర్తి చేశారని చెప్పవచ్చు. అతి చిన్న వయసులోనే కాసిపేట గ్రామపంచాయతీ ఎంపీటీసీగా ఎన్నిక కాబడి అనంతరం అప్పటి టిఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆశీస్సులతో ఏకంగా మండల ఎంపీపీగా నియమించబడ్డాడు. అప్పటి వరకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ సదరు గ్రామపంచాయతీ ప్రజానీకం ప్రణయ్ కుమార్ కు ఎంపీటీసీగా పట్టం కట్టారు. అనంతరం ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సొంత గ్రామపంచాయతీ తోపాటు, ఇతర గ్రామపంచాయతీలను అభివృద్ధి పరచడానికి అహర్నిశలు శ్రమించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతానికి భిన్నంగా యువకుడు కావడం చేత నిత్యం ప్రజల్లో ఉంటూ , అటు సోదరా ఎంపిటిసి లను, ఇతర ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను సమన్వయ పరుచుకుంటూ అభివృద్ధి చేశారని పలు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మండలంలోని కొంతమంది ప్రజాప్రతినిధుల మధ్య అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఓర్పుతో వారందరికి సద్ది చెబుతూ సమన్వయ పరిచిన తీరు పలువురుని ఆకట్టుకుంది. తన పదవి కాలం పూర్తయిన సందర్భంగా సదరు యువనేత ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రజలకు, అప్పటి ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రతి ఒక్క అధికారి నాకు సంపూర్ణంగా సహకరించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎలాంటి అవిశ్వాసాలకు తావివ్వకుండా, విశ్వాసం గా పని చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నేను ఎంపీపీ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటినుండి శక్తి వంచన లేకుండా పనిచేశానన్నారు. భవిష్యత్తులో ప్రజలు మరో మారు నన్ను ఆశీర్వదించి వారి సేవకు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానన్నారు.
Reporter
Telugu Rekha Media