Wednesday, 29 July 2026 08:56:43 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఆసరా పొందిన వృద్ధులు సొమ్మును తిరిగి చెల్లించాలనే విధానాన్ని పునరాలోచనచేయాలి...

వృద్ధుల పెన్షన్ తిరిగి చెల్లించాలనే ఉత్తర్వులను రద్దు పరచుకోవాలి. -- మునిగడప పద్మ విజ్ఞప్తి.

Date : 15 July 2024 02:25 PM

Telugu Rekha Media - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ వ్యాప్తంగా 42 మందికి ఇతర పెన్షన్ పొందుతూ 2017 నుండి ఆసరా పెన్షన్ పొందిన వృద్ధులు వితంతువులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆసరా పెన్షన్ 2000 రూపాయలని వారు వాడుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వృద్ధులపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పునరాలోచనచేసి, ఆ ఉత్తర్వులను రద్దు పరచుకోవాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధాప్య, వితంతు పెన్షన్లు కొంతమంది వృద్ధులు వితంతులు ఒక పెన్షన్ ఉండి రెండవ ఆసరా పెన్షన్ పొందుతున్నవారు ఇప్పటివరకు వారు వాడుకున్న 1,72,900 పైచిలుకు సొమ్ము తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఇచ్చిన ఉత్తర్వులతో వృద్ధులు, వితంతులు మానసిక ఆందోళన గురవుతున్నారని మునిగడప పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు వారి కుటుంబ అవసరాల రిత్య, బిపి, షుగర్ తదితర జబ్బులకు వచ్చిన రెండు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారని తిరిగి అలాంటి పేద, మధ్యతరగతి వారు డబ్బులు చెల్లించమంటే ఎలా చెల్లిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కొంతమంది రెండో పెన్షన్ వద్దని స్వచ్ఛందంగానే గత కొన్ని నెలల నుండి పెన్షన్ తీసుకోవడం మానేశారని, కానీ వారు ఇప్పుడు గతంలో వాడుకున్న సొమ్ము మొత్తం తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు అందించడంతో వారు ఆందోళన చెందుతున్నారని ఆమె పేర్కొన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా అధికారులు ఇచ్చిన ఉత్తర్వులపై పునర్ప రిశీలన చేసి ఉత్తర్వులను రద్దుచేసి వృద్ధులను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :