Wednesday, 17 June 2026 02:26:54 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పోచమ్మ గుడి భూమిని కబ్జాదారుల నుండి రక్షించండి.

- అక్రమ కట్టడాలను కూల్చివేసిన ప్రజలు, -- -సంబంధిత అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలి.

Date : 25 June 2024 09:27 AM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : మంథని మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి రహదారిని ఆనుకొని ఉన్న పోచమ్మ దేవాలయా భూములను భూ కబ్జాదారుల నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. పోచమ్మ గుడి మాన్యానికి సంబంధించిన బొక్కల వాగును ఆనుకుని ఉన్న భూమిని కొంతమంది రాజకీయ అండదండలతో కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దీంతో బోయిన్ పేట కు చెందిన తెలుగు గూడెం, గొల్లగూడెం,దుబ్బగూడెం, గంగాపురి గ్రామాలకు చెందిన వివిధ కులాలకు చెందిన ప్రజలు స్పందించి పోచమ్మ దేవాలయానికి సంబంధించిన భూమిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను సోమవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా మంథని మత్స్య సహకార సంఘం మంథని అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్ మాట్లాడుతూ తరతరాలు గా బోయిన్ పేటలోని తెనుగు గూడెం, గొల్లగూడెం, దుబ్బ గూడెం, గంగాపురి మరియు మంథని ప్రజలు ఈ పోచమ్మ దేవాలయంలోని పోచమ్మ తల్లిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారని, ఎటువంటి శుభకార్యాన్ని అయినా మొట్ట మొదలుగా పోచమ్మ కొలుపుతో మొదలుపెట్టి ప్రతి యేట వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అతి పవిత్రంగా చూసుకునే ఇటువంటి స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడం చాలా దారుణం అన్నారు. మంథని లో ఇటువంటి ప్రయత్నాలు చెల్లనేరవని బోయినపేట కు సంబంధించిన కుల పెద్దలు వెంటనే ఆ కార్యక్రమం పైన తీవ్ర స్థాయిలో మండి పడి ఈ భూ కబ్జాను ఆపడం జరిగిందన్నారు. ఇకమీదట ఎవరైనా గుడి జోలికి వచ్చిన గుడి స్థలాల జోలికి వచ్చిన సహించేది లేదని అన్నారు.ఎంతటి వారినైనా పోచమ్మ బలి తీసుకుంటుందని ఇకమీదట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ గుడి మాన్యానికి ప్రహరీ గోడ నిర్మించాలన్నారు. వనభోజనాలకు నిర్వహించుకునేందుకు తగిన సౌకర్యాలను కల్పించాలని, చెట్లను పెంచడం నీటి వసతి ఏర్పాటు చేసి పోచమ్మ గుడి అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రచించాలని సంబంధిత అధికారులను కోరారు. వెంటనే దేవాలయ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో అన్ని కులాల పెద్దలు పోతరవేని లక్ష్మిరాజం(అర్జున్), సబ్బని సమ్మయ్య,పొలు కనకరాజు,గుండా రాజు,కుంట బద్రి,మబ్బు నాగరాజు,పర్శవెన ఓదెలు, ఆర్కె రాజు,పర్శేవెన మోహన్,బంగారు మధునయ్య,మోసం కొమురయ్య,అంబటి కొమురయ్య,మోసం నర్సయ్య,అంబటి సత్తన్న,అంబటి నర్సింగ్,బత్తుల సత్యనారాయణ,బూర్ల శ్రీనివాస్,నల్లి శంకర్,నల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: