Telugu Rekha Media - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : ప్రతీ ఒక్క పోలీస్ అధికారి శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని, శారీరకంగా దృడంగా ఉన్నపుడే విధులు సక్రమంగా నిర్వహించగలరని, అందులో భాగంగానే జిల్లా పోలీస్ అధికారులకు అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్ వ్యాయమశాల అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు. సోమవారం రోజున పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన జిమ్స్ ను ఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే సిబ్బందికి, విధులతో పాటుగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆకాంక్షించారు. జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి ఈ జిమ్ అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలని తెలిపారు. ఈ సంధర్భంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిమ్ కోచ్ తో సహా అత్యాధునిక వ్యాయమ శాల అందుబాటులోకి తీసుకొచ్చిన జిల్లా ఎస్పీ కి, అధికారులు సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ లు మధుకర్, యాదగిరి, సిఐ కృష్ణ, మోగిలి, ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Telugu Rekha Media