Saturday, 13 June 2026 12:47:32 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

విద్యార్థులకు మెరుగైన విద్య భోధన చేయాలి...

పి.హెచ్.సి. లలో వైద్యులు అందుబాటులో ఉండాలి. ధరణి పెండింగ్ ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. -- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

Date : 24 July 2024 11:24 PM

Telugu Rekha Media - తెలంగాణ / సూర్యాపేట్ : విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.చివ్వేంల,మోతే మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ చివ్వేంల మండలంలోని జడ్.పి.హెచ్.సి పాఠశాలను తనిఖీ చేసి కలెక్టర్ విద్యార్థుల హాజరు రిజిస్టర్ ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఎ సబ్జెక్ట్ లో విద్యార్థులు వెనుకంజలో ఉంటారో ఉపాధ్యాయులు గుర్తించి వారిపై ప్రత్యేక చొరవ తీసుకొని పరీక్షల నాటికి అధిక మార్కులు వచ్చేలాగా కృషి చేయాలని ఉపాధ్యాయులకి సూచించారు .విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమకి తెలియజేయాలని కలెక్టర్ విద్యార్థులతో అన్నారు. మోతే పి హెచ్ సి ని తనిఖీ చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని,సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు .తదుపరి మెడికల్ రికార్డ్, ఓ పి రిజిస్టర్ పరిశీలించారు.పి హెచ్ సి కి వచ్చే రోగులకు టెస్ట్ లు చేపట్టి వచ్చే రిపోర్ట్ ఆధారంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.మోతే తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసి రికార్డ్స్ నిర్వహణ,ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి త్వరిగతిన దరఖాస్తులను పరిష్కరించి రైతుల సమస్యలు తీర్చాలని అధికారులకు సూచించారు.తదుపరి ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ని కలెక్టర్ పరిశీలించి గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాల మార్పులచేర్పులను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మోతే ఎంపిడిఓ హరిసింగ్ నాయక్, తహశీల్దార్ సంఘమిత్ర, మెడికల్ అధికారి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :