Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : “ప్రపంచ రక్త దాతల దినోత్చవo” సంధర్భంగా ఈ రోజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ముందుగా జిఎంహెచ్ బ్లడ్ బ్యాంక్ లో రక్త దాన శిబిరమును డిఎంహెచ్ఓ డాక్టర్. బి. సాంబశివ రావు, జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారితో కలసి ప్రారంభించడం జరిగింది. అనంతరం డాక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించి తదనంతరం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి మెయిన్ రోడ్ వద్ద మానవ హారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ సంధర్భంగా హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్. బి. సాంబశివ రావు గారు మాట్లాడుతూ 2004 లో మొదటి సారి ప్రపంచ రక్త దాతల దినోత్చవo నిర్వహించడం జరిగిందని ఇప్పటికీ 20 సంవత్చరాలు పూర్తి అయినుందున రక్త దాతలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ “20 years of celebrating giving: Thank You Blood Donors”అనే థీమ్ తో ముందుకు రావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు రక్త దానo చేయడానికి ముందుకు రావాలని ఒక్కరు రక్త దానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడిన వారమవుతామన్నారు. జిల్లాలో 2 (ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, హనుమకొండ, సిహెచ్సి పరకాల ) ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లతో పాటుగా రెడ్ క్రాస్ మరియు 8 గుర్తింపు పొందిన ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ రక్త దానం చేయడానికి యువకులు ముందుకు రావాలని తాము రక్త దానం చేస్తూ ఇతరులకు మార్గదర్శకంగా నిలబడాలన్నారు. జిఎంహెచ్ ఆవరణలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వలన ఆసుపత్రికి వచ్చే మహిళలకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా సౌకర్యంగా ఉందన్నారు. ఎలాంటి అపోహలకు లోనవకుండా రక్త దానానికి ముందుకు రావాలని పెద్ద వారిలో దాదాపు ఆరున్నర లీటర్ల రక్తం ఉంటుందని రక్త దాన సమయంలో కేవలం 400 మిల్లీ లీటర్ల లోపు సేకరిoచడం జరుగుతుందని ముఖ్యంగా యువత ముందుకు రావాలని, ప్రతి మూడు నెలల ఒకసారి తిరిగి రక్త దానం చేయవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్. బి. సాంబశివ రావు, జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తో పాటు అడిష్ నల్ డిఎంహెచ్ఓ డాక్టర్.టి. మదన్ మోహన్ రావు, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎండి. యాకూబ్ పాషా, డాక్టర్ ఉషా రాణి, ఆర్ఎంఓ డాక్టర్ సారంగం, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ హిమ బిందు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గీతా రాణి, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, DAPCU డిస్ట్రిక్ట్ మేనేజర్ స్వప్న కుమారి, HEEO చంద్ర శేఖర్, DPMO సుశీల, CHO మాధవ రెడ్డి, DAPCU నుండి రామకృష్ణ, కమలాకర్, హెచ్ఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Telugu Rekha Media