Telugu Rekha Media - తెలంగాణ / ఖమ్మం : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కార్యాలయం సమీపంలో కూరగాయల బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో ఎర్రబోలు ధర్మారావు(46)అనే వ్యక్తి మృతి చెందాడు. మధిర పట్టణంలోని వైయస్సార్ సర్కిల్లో నూతన ఏర్పాటుచేసిన రైతు బజార్లో కూరగాయల షాప్ నిర్వహిస్తున్న జిలుగుమడుగు గ్రామానికి చెందిన ఎర్రబోలు ధర్మారావు ఖమ్మం నుంచి కూరగాయలు తీసుకొని మధిరకు వస్తుండగా కొణిజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధర్మరావు కూర్చుని ఉన్న వ్యాన్ ను ఎదురుగా లారీ వస్తుండగా అదుపుతప్పిన ఆ కూరగాయల ఆటో కొట్టింది.ఈ ప్రమాదంలో ధర్మారావు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Telugu Rekha Media