Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సమాజంలో సామాజిక సేవ చేయడంతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య శ్రీ అన్నారు. మంగళవారం రోజున హుజరాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ లలో చదివే 73 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయుటకు స్టీల్ ప్లేట్లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంధ్య శ్రీ మరియు స్వరూప రాణి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సంధ్య శ్రీ మాట్లాడుతూ తల్లి పేరు న ట్రస్టు ఏర్పాటు చేసి సమాజంలోని పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు చేయడము మరియు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేయడం ,పరీక్ష ప్యాడ్స్ ఇవ్వడం, పదవ తరగతిలో మంచి జిపిఎ సాధించిన విద్యార్థులకు మెరిటేరియస్ అవార్డ్స్ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రభాకర్ రావు, వేణుమాధవ్, బిక్షపతి, శివకుమార్ ,సరస్వతి ,సరళ కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media