Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణి సకాలంలో అర్హులకు అందజేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య ఐఏఎస్ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరానగర్, రాజీవ్ గాంధి కాలనీ, ఎమ్మార్ పల్లె, ఐ.ఎస్.మహాల్, నెహ్రూ నగర్, మరికొన్ని ప్రాంతాల్లో ఫించన్ల పంపిణి జరుగుతున్న ప్రాంతాలను ఉదయం 6 గంటల నుండే కమిషనర్ మౌర్య స్వయంగా పరిశీలించి తగు సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 24వ డివిజన్ ఇందిరానగర్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ, బిజేపి నాయకులు వరప్రసాద్ సమక్షంలో జరుగుతున్న ఫించన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ఫించన్లకు ఓకటవ తేది తెల్లవారు జాము నుండే సచివాలయ సిబ్బంది ద్వారా అందరికి అందే ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు.
Reporter
Telugu Rekha Media