Thursday, 30 July 2026 04:07:25 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బాలికలు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి...

Date : 25 July 2024 10:34 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : విద్యతోపాటు బాలికలు యుక్త వయస్సులో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాల్య వివాహ చట్టాలపై అవగాహన వెంపొందించుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ కె. శ్రీదేవి అన్నారు. గురువారం జగన్నాధపురం గ్రామంలో మిషన్ శక్తి 100 రోజుల అవగాన కార్యక్రమంలో భాగంగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని 8,9,10 తరగతుల విద్యార్థులకు అవగామన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని 10వ తరగతి అనంతరం బాలికలకు బాల్య వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని అది చట్టరీత్యా నేరం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఉన్నత విద్యను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తే దేశాభివృద్ధిలో బాలికలు తమ వంతు పాత్ర పోషిస్తారని కోరారు. 18 సంవత్సరాలల లోపు బాలికలు వివాహం చేసుకోవడం ద్వారా కలిగే నష్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వ్యక్తిగతంగా తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్స్ ఎ. తులసీరాణి, కె.గీత, టి.రామలక్ష్మి, వి. అంజికుమారి, ఎం.శాంతకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: