Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బుధవారం కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో మార్కెట్ల వేలం పాటలను నిర్వహించారు. ఆళ్లగడ్డ డిఎస్పి షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగ్గురు సీఐలు పలువురు ఎస్ఐలు సిబ్బంది తో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వీక్లీ మార్కెట్ డైలీ మార్కెట్, కబేలా మార్కెట్ తదితర మార్కెట్ల వేలం పాటల ద్వారా మున్సిపాలిటీకి రూ.23 లక్షల 22 వేల ఆదాయం లభించినట్లు కమిషనర్ రమేష్ బాబు తెలిపారు.ప్రశాంత వాతావరణంలో వేలంపాటలు నిర్వహించేందుకు సహకరించిన డి.ఎస్.పి షర్ఫుద్దీన్, పోలీసు అధికారులకు కమిషనర్ రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శబరీష్, జిలాని యేసు రత్నం, బాలస్వామి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media