Sunday, 01 March 2026 11:52:24 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

టీటీడీకి కొత్త ఈవో నియామకం...

-- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Date : 15 June 2024 10:31 AM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారి జే.శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.టీటీడీ ఈవోను మార్చుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జే శ్యామల రావు 1997కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఈయన్ను దేవాదాయ శాఖలోని రెవెన్యూ విభాగానికి బదిలీ చేస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించింది. వెంటనే ఇప్పటివరకూ ఉన్న ఈవో ఏవీ ధర్మారెడ్డిని రిలీవ్ చేసింది.ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన మరుసటి రోజే టీటీడీపై దృష్టి సారించారు. ప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభిస్తానని అక్కడే ప్రకటించారు. ఆ మరుసటి రోజే టీటీడీకి నూతన ఈవోను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీ ఈవో స్థానంలో ఇప్పటివరకు పని చేసిన ఏవి. ధర్మారెడ్డిని వెంటనే రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :