Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు.పర్సు పోగొట్టుకొని ఆందోళనలో ఉన్న భక్తులకు పర్సును అందజేసి ఊరటను కలిగించారు. వివరాల్లోకెళితే కర్ణాటక రాష్ట్రం ములభాగల్ కి చెందిన జమున తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం ప్రసాదం అందజేసే క్యూలైన్లో ఆమె మనీ పర్స్ పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన భక్తులు ఆందోళనకు లోనయ్యారు.ఈ నేపద్యంలో క్యూ లైన్ లో దొరికిన పర్సును విజిలెన్స్ అధికారులు ఆలయ సూపరింటెండెంట్ మధు దృష్టికి తీసుకొచ్చారు. పర్సులోని గుర్తింపు కార్డు ఆధారంగా మైక్ సెట్ ద్వారా అనౌన్స్మెంట్ చేయగా భక్తులు సూపరింటెండెంట్ కార్యాలయం చేరుకున్నారు. పర్సులోని రూ 28,000,విలువైన బ్యాంక్ క్రెడిట్ కార్డులు,డెబిట్ కార్డులు, కొన్ని పత్రాలు భక్తురాలు జమున కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు అందజేశారు. ఆలయ సిబ్బంది అధికారులు నిజాయితీకి భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. విజిలెన్స్ ఏఎస్ ఐ బ్రహ్మానందం రాజు, సూపరింటెండెంట్ మధు, విజిలెన్స్ సిబ్బందిని ఆలయ డిప్యూటీవో గోవింద రాజన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అభినందించారు.
Reporter
Telugu Rekha Media