Saturday, 13 June 2026 12:49:48 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ హాజరైన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాన్, మంత్రులు...

Date : 22 July 2024 11:17 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారం మన చేతిలో పెట్టారు. ప్రజల ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టేలా పాలన అందించాలి. నడుచుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీయే ఎమ్మెల్యేలు, ఎమమెల్సీల భేటీలో అయన మాట్లాడారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసింది. ఆర్థిక శాఖ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఏ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి ఉండి ఉండదు. కనీసం అత్యవసర పనులకు కూడా నిథులు ఖర్చు చేయలేని పరిస్థితికి ఖజానాను తీసుకువెళ్లారు. గత ప్రభుత్వ అసమర్థ, విధ్వంస నాయకత్వం కింద అధికారులు గాడి తప్పారు, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. మన ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి...అవన్నీ పరిష్కరించుకుంటూ సంక్షేమం, అభివృద్ది అందించాలని అన్నారు. నాడు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పాలన చేశారు. పవన్ కళ్యాన్ విశాఖ వెళితే అక్కడ అడ్డుకున్నారు. అక్రమంగా నన్ను జైల్లోపెట్టిన సందర్భంలో పరామర్శకు వస్తుంటే కూడా అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేతగా నాడు ఎక్కడికి వెళితే అక్కడ ఆటంకాలు సృష్టించారు. నేను ఎక్కడికి వెళితే అక్కడ ఆపారు. 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ లేదు. అయినా నాడు జగన్ చేసినట్లు మనం చేయకూడదు. వాళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చారు. దోచుకున్నారు. వెళ్లిపోయారు. మనం రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం.

నాడు అత్యంత పాశవికంగా వివేకా హత్య....హత్య చేసి టీడీపీ వాళ్లపై తోసేశారు. వివేకా హత్యపై ఎన్ని డ్రామాలు ఆడారో మనం చూశాం. తప్పులు చేసి తప్పించుకోవడంలో వాళ్లు అరితేరారు. తాజాగా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైళ్ల దగ్దం ఘటన అందుకు ఉదాహరణ అనిఅన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అసైన్డ్ భూములు, 22 ఎ భూముల వివరాలు ఉన్న ఫైల్స్ తగలబడ్డాయి. ఇది అగ్నిప్రమాదం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఉదయం విషయం తెలిసిన వెంటనే హుటాహుటీన డీజీపీని నేను అక్కడికి పంపాను. విచారణ వేగవంతం చేయాలని ఆదేశించాను. మదనపల్లి ఘటన చూశాక...అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది..ఎంత పతనం అయ్యిందనేది స్పష్టం అవుతుంది. వ్యవస్థలు, అధికారుల్లో ఒక నిర్లిప్తత వచ్చింది. అందుకే అధికారులకు గట్టి ఆదేశాలు ఇచ్చి ఉరుకులు పెట్టించాను. వైసీపీ ఫేక్ ప్రచారం ఎలా చేస్తుంది అనడానికి వినుకొండ హత్య మరో ఉదాహరణ.

వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై జగన్ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటున్నాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ఉంటాం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. ఏ పార్టీ వాళ్లు అయినా సరే లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లోకి తీసుకుంటే మాత్రం సహించేది లేదని అన్నారు. మన వైపు నుంచి ఎవరైనా చిన్న తప్పు చేసినా ఉపేక్షించేంది లేదు. రాష్ట్రంలో వారసత్వంగా వచ్చిన హంసను తుదముట్టించాలి. జీరో క్రైం ఉండాలి. నేను 53 రోజులు జైల్లో ఉన్నా...నా కెంత బాధ ఉండాలి. అయినా సరే కక్ష సాధింపు రాజకీయాలు వద్దు. తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిద్దాం. అంతే తప్ప రాజకీయ కక్ష సాధింపులు వద్దు ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినేలా ఒక్కరు కూడా వ్యవహరించవద్దు. మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు ఈ విషయంలో స్పష్టంగా ఉండాలనిఅన్నారు. నెల రోజుల పాలనలోనే సంక్షేమ పథకాలు ప్రారంభించాం...చేసిన పనులు ప్రజలకు వివరించాలి. భవిష్యత్ లో ఏం చేస్తామో వారికి చెప్పి నమ్మకం కల్పించాలి. ప్రతి నెలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పింఛన్ల పంపిణీలో పాల్గొనాలి. పవన్ కళ్యాన్ కోరినట్లుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రోడ్లు దారుణంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ముందు పాత్ హోల్స్ పూడ్చే పని చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి 250 నుంచి రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. కాస్త వర్షాలు తగ్గిన వెంటనే దీనిపై దృష్టిపెడదాం. డిల్లీ పర్యటనలో రాష్ట్ర పరిస్థితులు కేంద్రానికి వివరించాం. రాష్ట్రానికి సాయం చేసే విషయంలో వాళ్లు సానుకూలంగా ఉన్నారు. మూడు పార్టీల నేతలు కలిసి పనిచేయాలి. ఎవరి సెంటిమెంట్ దెబ్బతినకుండా చూడాలి. ఉచిత ఇసుక ఇచ్చాం....దాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూడాలి. మనపై ఇసుక విషయంలో చిన్న విమర్శ రాకుండా ఉండాలి. ఈ విషయంలో మళ్లీ మళ్లీ చెపుతున్నా మన పార్టీ నేతలు ఎవరు ఈ విషయంలో వేలు పెట్టినా అంగీకరించేది లేదు. ఉచిత ఇసుక విధానం పక్కాగా అమలు కావాలి. క్వారీల్లో ఇసుక తవ్వకం, రవాణా ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేస్తాం. ఈ విషయంలో మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు చేతులు పెట్టొద్దు. మనది ప్రజా ప్రభుత్వం...డాబు దర్పం అహంకారం వద్దు. సింపుల్ గా ఉందాం...ప్రజలతో కలిసి పనిచేద్దాం. నా కోసం ట్రాఫిక్ నిలపవద్దు అని అధికారులకు చెప్పాను. ఈ విషయంలో ట్రాఫిక్ చూసుకుని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అది పాటించాలి. సైరన్లు, భారీ కాన్వాయ్ లు, హడావుడితో ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. అసెంబ్లీలో క్వశ్యన్ అవర్ ను ఎమ్మెల్యేలు అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం 9 నుంచి 10 వరకు ప్రశ్నోత్తరాలు జరిగేలా చూద్దాం. ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి సూచనలు రావాలి...క్షేత్రస్థాయి పరిస్థితులు మా దృష్టికి తీసుకురండి. 2029 ఎన్నికల్లో గెలవాలి అనే లక్ష్యంతో నేటి నుంచే మీరు అంతా పనిచేయాలి. వికసిత్ భారత్ విజన్ 2047 అని ప్రధాని అన్నారు. మనం విజన్ వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ అని విజన్ సిద్ధం చేస్తున్నాం. మీ నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఒక ప్లాన్ సిద్ధం చేసుకోండి. ప్రణాళికతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :