Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్/తుగ్గలి : తుగ్గలి మండలం వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం రోజున డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. తుగ్గలి మండలంలోని రాంపల్లి గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమంది అర్ధాకలితో బాధపడుతున్న పేద విద్యార్థుల కడుపునింపుటకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టత్మాకంగా అమలు పరచిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల సమక్షంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రము లోని అన్నీ ప్రభుత్వ ఏయిడెడ్ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కొరకు రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలుపరచి ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని,రాంపల్లి లో ఉన్న పాఠశాలలో మన పత్తికొండ ఎమ్మెల్యే కేయి శ్యామ్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు ప్రారంభించడం సంతోషకరమని ఆయన తెలియజేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఏయిడెడ్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని విద్యార్థులకు సంపూర్ణ పౌష్టిక ఆహారాన్ని అందివ్వడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా శభాష్ పురం ప్రభుత్వ పాఠశాల యందు తెలుగు యువత నాయకులు మోహన్, రోల్లపాడు తాండ గ్రామం నందు తులసి నాయక్ తదితరులు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media