Sunday, 01 March 2026 10:12:38 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు...

Date : 29 July 2024 07:17 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్/తుగ్గలి : తుగ్గలి మండలం వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం రోజున డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. తుగ్గలి మండలంలోని రాంపల్లి గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమంది అర్ధాకలితో బాధపడుతున్న పేద విద్యార్థుల కడుపునింపుటకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టత్మాకంగా అమలు పరచిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల సమక్షంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రము లోని అన్నీ ప్రభుత్వ ఏయిడెడ్ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కొరకు రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలుపరచి ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని,రాంపల్లి లో ఉన్న పాఠశాలలో మన పత్తికొండ ఎమ్మెల్యే కేయి శ్యామ్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు ప్రారంభించడం సంతోషకరమని ఆయన తెలియజేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఏయిడెడ్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని విద్యార్థులకు సంపూర్ణ పౌష్టిక ఆహారాన్ని అందివ్వడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా శభాష్ పురం ప్రభుత్వ పాఠశాల యందు తెలుగు యువత నాయకులు మోహన్, రోల్లపాడు తాండ గ్రామం నందు తులసి నాయక్ తదితరులు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :