Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / విశాఖపట్నం : మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరవకముందే తాజాగా మరో ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులు పై టీడీపీ అధికార పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. నేను మంత్రి అచ్చన్నాయుడు తాలూకా అంటూ హల్చల్ చేశాడో నేత. అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీసుల పై మందుబాబులు వీరంగం చేసారు. మద్దిలపాలెం నడిరోడ్డుపై పోలీసులపై నానా దుర్భాషలు ఆడారు. ట్రాఫిక్ పోలీసులతో అధికార పార్టీ నేతల వాగ్వాదం జరిగింది. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేరుతో పోలీసులను బెదిరించారు. మద్దిలపాలెం సిగ్నేల్ జుంక్షన్ వద్ద హైడ్రామా నడిచింది. తాగి కారు నడిపిన సదరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదయింది. ఎస్సై, సీఐ, సీపీలను వీఆర్ కు పంపిస్తామని నేతలు వార్నింగ్ ఇచ్చారు.
Reporter
Telugu Rekha Media