Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల్ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను,(లోకల్ బాడీస్) గౌతమ్ రెడ్డి తో కలసి స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 91 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల,కోరుట్ల, ఆర్దీవోలు, మధు సుధన్, ఆనంద్ కుమార్,కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంత రావు, డిపివో రఘు వరుణ్, సిపిఓ,వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media