Telugu Rekha Media - జిల్లా వార్తలు / నంద్యాల : మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వీరభిమాని నాసిర్ పఠాన్ , మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు అనాధ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగళ్ళపాడు వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాసిర్ పఠాన్ మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని , తన పుట్టినరోజు సందర్భంగా వందలాదిమందికి ఉచితంగా మరెంతో మందికి గుండె ఆపరేషన్లు చేయించాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్న అని తెలిపారు. పసుపుల మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ.. వీరి సేవా కార్యక్రమాలు అనేక రూపాలుగా నేడు రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులను ఆదుకొనుట, అన్నదానం నిర్వహించుట, కరోనా సహాయములో వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాసిర్ పఠాన్ , పసుపుల మధుసూధన్ రెడ్డి, అనాధ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, ఫసక్ బాలాజీ, అబ్ధుల్ మునాఫ్, ఎక్ట్రానిక్ బాషా, మాలి భాష ( చికెన్ సెంటర్), అజ్జు, సమీ, పాములేటీ, సర్ధార్, ( ఫుట్ వేర్ ) జాని, వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media