Telugu Rekha Media - జిల్లా వార్తలు / అమరావతి : విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ కోరారని అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేశానన్నారు. ఈ క్రమంలో మాకు సంఖ్య బలం ఉంది..కాబట్టీ ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్యే అన్నారు. తమకు మెజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని..రాజకీయాలు వ్యాపారం కాదన్నారు.
Reporter
Telugu Rekha Media