Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల/కోరుట్ల : పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత- గంగాధర్ సూచించారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం -పచ్చదనం గొప్ప కార్యక్రమమని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.దీనిలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటింటికి తిరిగి కూలర్లు ఉపయోగంలో లేని కుండీలలో నిలువైన నీటిని వారు తొలగించారు.. కుక్కలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పెంపుడు కుక్కలకు తప్పకుండా టీకాలు వేయించాలని కోరారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసరాలలో అశుభ్రమైన వస్తువులలో నిల్వ ఉన్న నీరు ఉన్న తొలగించి ఇంటి పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా మీ ఇంటి ముందుకు వచ్చిన మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని దోమల బెడద లేకుండా చూసుకోవాలన్నారు.. దోమల ద్వారా డెంగ్యూ,మలేరియా,వంటి విషపూరితమైన జరాలు వస్తాయని అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత గంగాధర్ తో పాటు వార్డు ఇంచార్జ్ జగ్గల రమేష్, రామస్వామి, ఆర్పి వనిత,అంగన్వాడీ టీచర్ హిమగిరి, ఏఎన్ఎం రజిత, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media