Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / ఆదిలాబాద్ : గుడుంబా రహిత జిల్లా గా మార్చడమే జిల్లా పోలీసుల లక్ష్యం. గుడుంబా రహిత జిల్లాగా జగిత్యాలను చూడాలనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ వారితో సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దాడిలో 6 లీటర్ల గుడుంబాను, 90 లీటర్ ల బెల్లం పానకం స్వాధీనం చేసుకొని గుడుంబా స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుడుంబాకు అలవాటు పడి ఎంతోమంది కుటుంబాలను చిన్నాబిన్నం చేసుకొని చివరకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. అంతే కాకుండా మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తునట్టు తెలిసిన, అమ్మిన వెంటనే పోలీసు స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గొప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క తనిఖీల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వినోద్ రాథోడ్, ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media